జనగామ జిల్లా అక్కపల్లిగూడెం పంచాయతీ కార్యదర్శి అవినాష్ చేసిన కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. అవినాష్ తన చొరవతో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సహాయంతో బీడు భూములను సారవంతమైన పంటపొలాలుగా మార్చారు. ఈ పని ఇతర గ్రామాలకు సైతం ప్రేరణగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. అధికారులు ఇలాంటి సామాజిక బాధ్యతతో పనిచేస్తే.. గ్రామాల్లో వ్యవసాయం వృద్ధి చెంది, స్థానిక ప్రజల జీవనం మెరుగవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.