ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీలో చేరారు. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఇటీవల రాజీనామా చేశారు. తాజాగా వైసీపీలో చేరుతూ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక టీడీపీలో విభేదాలే సుగవాసి బాలసుబ్రమణ్యం పార్టీ మార్పునకు కారణమని తెలుస్తోంది.