రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తాము పవర్లోకి రాగానే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీజేపీ ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆయన విమర్శించారు.