Chandrababu Naidu Pothole Free Roads: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రోడ్ల మీద ఒక్క గుంత కూడా తనకు కనిపించకూడదని ఆదేశించారు. రోడ్ల మరమ్మతులో ఇంజినీర్లు.. కొత్త టెక్నాలజీతో నాణ్యతగా పనులు చేయాలని సూచించారు. అలానే రోడ్డు అభివృద్ధి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. పనుల ప్రారంభంలో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఆ వివరాలు..