Kalyandurg Excise Ci Attack On Attender: అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనాభాను ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె తన ఆఫీస్ అటెండర్ను చెప్పుతో కొట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం అక్రమంగా విక్రయించే వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నావని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావని సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.