Penukonda Bride Suicide: శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం వివాహం చేసుకున్న వధువు సాయంత్రానికి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన కలకలం రేపింది. సోమందేపల్లికి చెందిన యువతికి కర్ణాటకకు చెందిన యువకుడికి సోమవారం ఉదయం వివాహం జరిపించారు. అనంతరం కొత్త జంట సోమందేపల్లికి వచ్చారు.. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో యువతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.