అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు కండక్టర్, కానిస్టేబుల్ మధ్య టికెట్ విషయంలో గొడవ జరిగింది. టికెట్ అడిగిన కండక్టర్ పై హెడ్ కానిస్టేబుల్ దుర్భాషలాడారు. తాను హెడ్ కానిస్టేబుల్ ని అంటూ టికెట్ తీసుకోనని బెదిరించారు. కండక్టర్ పట్టుబట్టడంతో ప్రయాణికులు కలగజేసుకుని టికెట్ తీసుకునేలా చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ డీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు కండక్టర్ తెలిపారు. ఈ ఘటనను బస్సులోని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.