ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో ఒకే వ్యక్తికి మూడు పోస్టులు అప్పగించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో రిజిస్ట్రార్ అదనపు బాధ్యతలు మార్కెట్ విలువ రిజిస్ట్రార్గా ఉన్న శ్రీనివాసులకు అప్పగించారు. దీంతో ఒకే వ్యక్తి మూడు పోస్టులను నిర్వహించడం సాధ్యమేనా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆయా జిల్లాలకు రిజిస్ట్రార్లను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.