Dharmavaram Fake Currency Trading: అనంతపురం, ధర్మవరం ప్రాంతంలో సరికొత్త మోసం జరుగుతోంది. కొందరు కేటుగాళ్లు అమాయక వ్యాపారులు, రైతుల్ని మోసం చేస్తున్నారు.. నకిలీ నోట్లతో పాపం వారిని మోసగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇదే తరహాలో చీటింగ్ జరిగింది. కిరాణా, ఎరువుల దుకాణం, కూల్డ్రింక్ షాపులు.. ఇలా అందరూ నకిలీ నోట్ల బాధితులే. ఈ గ్యాంగ్ రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే.. రూ.4లక్షలు నకిలీ నోట్లు ఇస్తామంటూ వ్యాపారం చేస్తోంది.