Bangalore To Puttaparthi Passenger Train 66559 Extended To Anantapur: అనంతపురం ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. పుట్టపర్తి-బెంగళూరు మధ్య నడుస్తున్న మెమూ రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు అందుబాటులోకి రావడంతో తక్కువ ఛార్జీలతో బెంగళూరుకు వెళ్లొచ్చని అధికారులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.