తమ ఇంటి ముందున్న అస్తిని అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. వివాదం కోర్టులో ఉండగానే.. అక్రమంగా స్థలంలోకి చొరబడి, లారీలతో మెటీరియల్ డంప్ చేశారని ఆయన ఆరోపించారు. ఆయన తన మేనమామ చేగోండి హరిరామ జోగయ్య కుమారుడిపై ఆరోపణలు చేశారు. దీనిపై చేగోండి సూర్యప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.