అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతూ వెంకట్ అనే పంచాయతీ కార్యదర్శి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చోడవరం మండలానికి చెందిన వెంకట్ అల్లూరి జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిద్రలేమి వ్యాధితో ఇబ్బంది పడుతున్న వెంకట్ శనివారం లేఖ రాసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనరై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.