అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ చోరీ జరిగింది. చోడవరంలోని గోవాడలో ఓ మహిళ ఇంట్లోని 65 తులాల బంగారం, నగదును చోరీ చేశారు. చోరీ అయిన మొత్తం సొత్తు విలువ రూ.1.5 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంత పెద్దమొత్తంలో బంగారం దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.