అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటుచేసే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ప్లాంట్ శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. సుమారుగా రూ.1.40 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 2200 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 15 తర్వాత అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.