అనకాపల్లి జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లతో మహిళలను కంటిమీద కునుకు లేకుండా చేసిన ముగ్గురు దొంగల ముఠాను కసింకోట పోలీసులు మెరుపుదాడితో పట్టుకున్నారు. 'ఆపరేషన్ గోల్డ్' పేరుతో చేపట్టిన ఈ దర్యాప్తులో.. జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన తొమ్మిది కేసులను ఛేదించి, దొంగల నుంచి రూ. 26 లక్షల విలువైన 26 తులాల బంగారం, మూడు సెల్ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. బైకుల మీద తిరుగుతూ.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని.. మెడలోంచి బంగారు గొలుసులు లాక్కుని పరారవుతున్నారని డీఎస్పీ వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. ముగ్గురు నిందితులను నిఘా పెట్టి పట్టుకున్నామని తెలిపారు.