ప్రేమించిన వ్యక్తి మరణంతో తట్టుకోలేక సిద్దిపేట జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియెట్ చదివి, కూలీ పనులు చేస్తున్న శ్రావణి (18), తాను ప్రేమించిన మహేశ్ అలియాస్ రహీం బాబా కామెర్ల వ్యాధితో మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.