Nk Agarwal Rs 1 Crore To Anna Canteens: ఏపీలో అన్న క్యాంటీన్లకు రూ.కోటి విరాళం అందింది. బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ సంస్థ ఈ సాయం చేసింది. ఈ మేరకు చెక్కును చంద్రబాబుకు అందజేశారు. పార్టీ కార్యాలయాల లీజు వ్యవధి 66 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విత్తన బిల్లు-2025 ముసాయిదాపై ప్రజాభిప్రాయాలు ఆహ్వానించారు. ఏపీఈడీబీ సీఈవో శ్రీకాంత్ వర్మ సెలవులో వెళ్లనున్నారు. పోలవరం ప్రత్యేక కలెక్టర్గా సరళా వందనం కొనసాగుతారు.