రైతు భరోసా నిధుల విడుదల వేళ.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. రైతుల కోసం తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని తెలిపారు. అన్నదాతలు వ్యవసాయం చేసేందుకు తాము భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా.. తమ ప్రభుత్వంలో రైతును రాజుగా చూసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.