ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో రెండు హామీల అమలుకు సిద్ధమైంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 12వ తేదీన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు. బుధవారం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 12న అన్నదాత సుఖీభవ , తల్లికి వందనం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.