ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక. జూన్ నెలాఖరులోగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రైతులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హత ఉండి కూడా.. వివరాల్లో తప్పుల కారణంగా పథకానికి దూరంగా ఉన్నవారు తప్పులు సవరించేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. రైతులు తమ పత్రాలతో రైతు సేవా కేంద్రం అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.