Annadata Sukhibhava Scheme 2025 Pending Money Release: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసింది. అయితే, కొంతమందికి డబ్బులు చేరకపోవడంతో వ్యవసాయ శాఖ గ్రీవెన్స్లో 10,915 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. చాలా దరఖాస్తులు ఆమోదం పొందాయి, కొన్ని పరిశీలనలో ఉన్నాయి. ఎన్నికల నియమావళి, ఈకేవైసీ, ఎన్పీసీఐ సమస్యల వల్ల నిధులు పడలేదని అధికారులు తెలిపారు. అర్హులైన రైతుల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ కానున్నాయి.