ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన రూ.2000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 కలిపి.. రూ.7000 అందించనున్నారు. అయితే జూన్ 20వ తేదీ అన్నదాత సుఖీభవ విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే జూన్ నెలాఖరులో పీఎం కిసాన్ యోజన 20వ ఇన్స్టాల్మెంట్తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారని సమాచారం.