Annadata Sukhibhava Scheme 2025 Grievance August 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసింది. అయితే, కొందరికి డబ్బులు చేరకపోవడంతో, ఈ నెల 20లోగా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. E-KYC చేయనివారు, ధ్రువీకరణలో తిరస్కరణకు గురైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. NPCIతో అనుసంధానం లేని ఖాతాలకు డబ్బులు జమ కాలేదని అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.