అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. అక్టోబర్ నెల మొదటి వారంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులను అక్టోబర్ నెల మొదటి వారంలో జమ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అక్టోబర్ మొదటి వారంలో రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయవచ్చని తెలుస్తోంది.