ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావంపై ఆర్థిక మంత్రి పయ్యావుల ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో పయ్యావుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎల్సీ కాలువ పరిస్థితిపై పయ్యావుల ఆందోళన వ్యక్తం చేశారు. తనకు హెచ్ఎల్సీ కాలువతో 3 దశాబ్దాలుగా అనుబంధం ఉందని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వరి, మిర్చి పంటలకు నీరు అందించేందుకు అవకాశాలు లేవని స్పష్టం చేశారు.