ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఏపీలో సర్ ప్రకియ గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకూ పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే సర్ ప్రక్రియలో క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ ఐదో తేదీ వరకూ అవకాశం ఇచ్చారు. అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.