Annadata Sukhibhava Scheme 2025 Pending: ఏపీ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది. ఈ నెల 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.. ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 2 నుంచి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు ఇప్పటికి అన్నదాత సుఖీభవ పథకం విషయంలో ఇబ్బందిపడుతున్నారు.. వారందరికి ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది.