ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకంపై కీలక అప్ డేట్ వచ్చింది. అర్హులైనప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం అర్హుల జాబితాలో పేరు లేనివారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించారు. జూలై 23 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. మరోవైపు పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ డబ్బులు అందించనున్నారు. జూలై నెలాఖరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిసింది.