తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఖరారు చేయడంతో.. ఆయన గెలుపు కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డి ఎంపిక తెలుగు ప్రజలకు గర్వకారణమని, రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కూడా కలుస్తానని రేవంత్ తెలిపారు.