కాంగ్రెస్ పార్టీలో పరకాల చిచ్చు మరింత రాజుకుంది. మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డిని పరకాల ప్రజలు దీవించాలని కోరిన వేళ.. కొండా సురేఖ కుమార్తె పెట్టిన ఇన్స్టా స్టోరీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 'అప్కమింగ్ పరకాల ఎమ్మెల్యే' అంటూ కొండా సుస్మిత పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. పరకాల సీటును ఆశిస్తున్న కొండా కుటుంబానికి షాకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఇది కౌంటర్ అంటూ చర్చ జరుగుతోంది. మరోవైపు.. సీఎం పరకాల టూర్కు మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టడం గమనార్హం.