తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలోని ఏ పార్టీకి కూడా టీవీ ఛానల్, పత్రిక లేదని, జగన్కు మాత్రం ఉన్నాయని అన్నారు. ఈ మాటలు విన్న జనాలు.. గతంలో జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేసుకుంటున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన సభలో చంద్రబాబు, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అర్హులకే పింఛన్లు అందిస్తామని, నేర చరిత్ర ఉన్నవారిని రాజకీయాలకు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఆ వివరాలు..