ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం అనుకోకుండా జరిగిందని.., ఇది ఒక విపత్తు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లారని బీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే హరీశ్రావు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ ప్రమాదం తర్వాత హరీశ్రావు రెండ్రోజులు అబుదాబిలో దావత్ చేసుకున్నారని ఆరోపించారు.