youth steal clothes after checking sizes in Chittoor: చిత్తూరు జిల్లాలోని నాగలాపురంలో ఓ టెక్స్టైల్స్ షాపులో విచిత్రమైన దొంగతనం జరిగింది. ముస్తఫా టెక్స్టైల్స్లో చొరబడిన ఇద్దరు యువకులు రూ.35 వేల విలువైన దుస్తులు, రూ.75 వేల నగదును ఎత్తుకెళ్లారు. అయితే, దొంగలు షాపింగ్ వచ్చినట్లుగా తమకు నచ్చిన సైజు, రంగు, క్వాలిటీ చూసుకుని మరీ దుస్తులను ఎంచుకోవడం విశేషం. అంతేకాదు, వెళ్ళే తొందరలో వదిలేసిన సంచీలను తిరిగి వచ్చి తీసుకువెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.