ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల్లో ఓ తప్పు.. విద్యార్థులను ఆందోళనకు గురి చేసింది. క్వశ్చన్ పేపర్ సెట్టర్ తప్పు కారణంగా విద్యార్థులు కాసేపు ఇబ్బందులు పడ్డారు. కామర్స్ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలో.. ఒకే ప్రశ్న మూడు సార్లు వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికి విద్యార్థులకు ఈ విషయం తెలిసింది. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు అప్రమత్తమై ప్రశ్నాపత్రం సెట్ మార్చేశారు.రెండో సెట్ పేపర్ అందించారు. పేపర్ సెట్టర్ తప్పుతో ఇలా జరిగిందని అధికారులు చెప్తున్నారు.