తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఎన్నో సార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు గత ఏడాది పరీక్షను అధికారులు పూర్తి చేశారు. అయితే ఫలితాల విడుదలకు చాలా సమయం తీసుకొని.. ఒక్కసారే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. అయితే వీటిలో ఇప్పటికే మొదటి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన అధికారులు.. తాజాగా సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. ఈ వెరిఫికేషన్కు ఎంపికైన వారి హాల్ టికెట్స్ను కూడా వెబ్ సైట్లో అప్ లోడ్ చేశారు. వీరు ఆగస్టు 20 నుంచి వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.