నవ్యాంధ్రకు నవోదయం.. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి తిరిగి పురుడు పోసుకుంది. అనేక సవాళ్లు, పోరాటాల మధ్య అమరావతి పునరుజ్జీవం పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభమయ్యాయి. కోట్ల మంది ప్రజల రాజధాని కలను, యువత ఆశలను నెరవేరుస్తూ నవ్యాంధ్ర ప్రగతి రథానికి అమరావతి సారథిగా మారనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయనుంది. ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం వేళ.. ఆ వివరాలు..