అమరావతి: ఇక నో టెన్షన్.. నెలలోపే పింఛన్లు, హెల్త్ కార్డులు.!

4 months ago 16
అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రెండో విడత భూ సమీకరణ చేపట్టనుంది. అయితే రెండో విడత భూ సమీకరణకు ముందు అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా త్రిసభ్య కమిటీ సీఆర్డీఏ అధికారులతో సమావేశమైంది. అనంతరం అమరావతి రైతుల పింఛన్లు, హెల్త్ కార్డుల సమస్యలను నెలలోపు పరిష్కరిస్తామని మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
Read Entire Article