Amaravati Huge Fishes: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం ర్యాప్ట్ ఫౌండేషన్ దగ్గర భారీ గుంతల్లో నీటిని తోడేస్తున్నారు. అక్కడ మోటార్ల సాయంతో నీటిని తోడుతుండగా పెద్ద ఎత్తున చేపలు బయటపడుతున్నాయి. ఈ చేపల కోసం స్థానికులు ఎగబడుతున్నారు.. అక్కడ ఏకంగా 500 కిలోల వరకు చేపలు దొరికినట్లు తెలుస్తోంది. కొన్ని చేపల్ని మార్కెట్లకు కూడా తరలించారట.