ఏపీ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. గుంటూరు, తెనాలి, అమరావతి మీదుగా 180 కిలోమీటర్ల మేరకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి. కొన్ని మండలాల్లో భూముల సర్వే నంబర్లను గుర్తించారు. వాటిని అమ్మడానికి వీలులేకుండా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. అలాగే లేఔట్లు, నాలా ఫీజులు వసూలు చేయవద్దంటూ రెవెన్యూ అధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి.