AP Govt Gives Clarity On Steel Bridge: ఏపీ రాజధాని అమరావతిలో బకింగ్ హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని.. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలెవరూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీఎల్) స్పష్టం చేసింది.