అమరావతి: గ్రహణం వీడి.. వెలుగుబాట పట్టిన అమరావతి.. వీడియో షేర్ చేసిన టీడీపీ

8 hours ago 2
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అమరావతిపై వీడియోను విడుదల చేసింది. మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article