రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా తాజాగా కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అసెంబ్లీలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా టెండర్లు ఆహ్వానించింది. మొత్తం హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రూ.1816 కోట్లను అంచనా వ్యయంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు భవనాల నిర్మాణాలతు తాజాగా సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. గతంలో నిర్ణయించిన అంచనా వ్యయం.. పనులు ఆలస్యం కారణంగా భారీగా పెరిగినట్లు సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు.