నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి పునఃప్రారంభం కోసం అంతా సిద్ధమైంది. మే రెండో తేదీన అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు అమరావతి పునఃప్రారంభం ఆహ్వాన పత్రికలను సిద్ధం చేసినట్లు తెలిసింది. అతిథులకు వీటిని అందించి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అమరావతి ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.