Amaravati Foundation For Banks: అమరావతిలో మరో ముందడుగు పడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన జరిగింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు హాజరయ్యారు. 15 సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని ప్రశంసించారు. 2028 నాటికి నిర్మాణాలు పూర్తి చేసి, దేశానికి గర్వకారణంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.