Amaravati Srinivasa Kalyanam On 15th March: అమరావతిప్రాంత ప్రజలకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. ఈ నెల 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా పోస్టర్ను టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి వైభవం తెలియజేసేందుకు ఈనెల 15న వెంకటపాలెంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 25వేల మందికిపై భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా వస్తున్నట్లు చెప్పారు.