ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుపడింది. రాజధానిలో ఐదు భారీ టవర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్లు ఆహ్వానిస్తోంది. సచివాలయ టవర్లు, హెచ్వోడీ కార్యాలయ టవర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయ నిర్మాణంలో నాలుగు టవర్లు, హెచ్వోడీ ఆఫీస్ టవర్ నిర్మాణం కోసం ఈ టెండర్లు పిలిచారు. మొత్తం ఐదు టవర్ల నిర్మాణానికి 4,668 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోవైపు మే రెండో తేదీన ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే.