ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు త్వరలో జోరందుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులకు పునఃప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం వెల్లడించారు. ఏపీ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో చంద్రబాబు ఈ వివరాలను పంచుకున్నారు.