రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండో విడత భూసమీకరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏడు గ్రామాల పరిధిలో భూమిని సమీకరించనున్నారు. ఇప్పటికే ప్రక్రియ కూడా మొదలైంది. మరోవైపు అమరావతి కోసం తొలివిడత భూసమీకరణ సమయంలో చేసిన విధంగా కాకుండా.. రెండో విడతలో భూములు ఇచ్చే రైతులకు ఒకేచోట రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏ భావిస్తున్నట్లు సమాచారం. ఏడు గ్రామాల రైతులకు ఒకేచోట లేఅవుట్ అభివృద్ధి చేసి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించే ఆలోచనలో సీఆర్డీఏ ఉన్నట్లు తెలిసింది.