ఏపీ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి కౌలు సొమ్ము పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. సీఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షలో 16,667 ఎకరాల భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజధాని గ్రామాల్లో ఎఫ్ఎస్ఐ పెంపుపై అధ్యయనం జరుగుతోందని అలాగే పురపాలక సంస్థల్లోని డంపింగ్ యార్డుల వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.