అమరావతి పునఃప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పునః ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెలగపూడిలో జరిగిన అమరావతి సభలో మోదీ పాల్గొన్నారు. అయితే అమరావతి సభలో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో వెనక్కి పిలిచిన ప్రధాని మోదీ.. పవన్ కళ్యాణ్ చేతికి బహుమతి అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.